'వినరో భాగ్యము విష్ణు కథ' అందరినీ ఆకట్టుకుంటుంది: బన్నీ వాసు

by Disha Web Desk 7 |
వినరో భాగ్యము విష్ణు కథ అందరినీ ఆకట్టుకుంటుంది: బన్నీ వాసు
X

దిశ, సినిమా: స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్న సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా కిరణ్ అబ్బవరం, కశ్మీర హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రెస్ మీట్‌ ఏర్పాటు చేసింది చిత్రబృందం.

ఈ మేరకు మాట్లాడిన చిత్ర నిర్మాత ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని భారీ అంచనాలను క్రియేట్ చేశాయన్నారు. నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ప్రేమ, కామెడీ, థ్రిల్లింగ్‌తో కూడిన అన్ని అంశాలు మిళితమై చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందన్నారు. చివరగా ఫిబ్రవరి 16న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలిపిన మేకర్స్.. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా అక్కినేని అఖిల్ హాజరుకాబోతున్నట్లు తెలిపారు.

Also Read...

ఆ విషయంలో నాగార్జున చాలా క్లారిటీగా ఉంటాడు: జగపతిబాబు



Next Story

Most Viewed